ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి విందు

4వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ విందు ఇవ్వనున్నారు. ఒబామా త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా భార్య మిషెల్‌తో కలిసి ఒబామా బ్రిటన్‌ రాణి ఆతిథ్యాన్ని స్వీకరించనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న విండ్సర్‌ క్యాజిల్‌లో ఈ విందు ఏర్పాటుచేసినట్లు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జోష్‌ ఎర్నెస్ట్‌ తెలిపారు.

అనంతరం అదే రోజు సాయంత్రం కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌లో బ్రిటన్‌ రాకుమారుడు విలియం దంపతులు, ప్రిన్స్‌ హ్యారీ కూడా ఒబామా దంపతులకు విందు ఇవ్వనున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో ఒబామా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.