కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి:తెలంగాణ ఈ పంచాయతీ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 25, జనం సాక్షి.

తెలంగాణ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పులుగారి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంఛార్జి జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున్ కు సమ్మె నోటీసును సమర్పించినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నామని చాలీచాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో ఏ సమస్యలు ఉన్న ఈ పంచాయతీ ద్వారానే పనులు చేపడుతున్నామని. ఆన్లైన్ ద్వారా తాము అనేక సేవలు అందిస్తున్నామని. తమ సేవలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పులుగారి నవీన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నర్సింలు,ఉపాధ్యక్షులు వెంకట రాజిరెడ్డి,ముత్యంగారి నవీన్, స్వామి, రాజిరెడ్డి, మహేష్, నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.