కజకిస్థాన్‌లో దుండగుల కాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

2222ఆల్మటీ: కజకిస్థాన్‌ ఆర్థిక రాజధాని ఆల్మటీలో సోమవారం దుండగులు రెచ్చిపోయారు. నగరంలోని పలుచోట్ల భద్రతాసిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు.

ఆల్మటీలోని పలు చోట్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓ వ్యక్తి తుపాకీతో వెళ్లడం తాను చూశానని దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పాడు. కాల్పుల ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టి దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేఎన్‌బీ సెక్యూరిటీ పోలీస్‌ కార్యాలయం సహా.. పలు చోట్ల విస్త్రత తనిఖీలు చేపట్టారు. ఓ దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.