కన్న కొడుకులపైనే ఆ తల్లి పోరాటం… అల్లారుముద్దుగా పెంచింది

poratamఖమ్మం:అన్నీ దగ్గరుండి చూసుకుంది. పంచప్రాణాలు ఆ ఐదుగురు కుమారులే అనుకుని జీవించింది. పెంచి పెద్ద చేశాక ముసలి తల్లికి మొహం చాటేశారు. బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా వాళ్లకు ఆ తల్లి భారమైంది. చివరికి తన కుమారులపైనే ధర్మ పోరాటానికి ఆ ముసలి తల్లి సిద్దం అయింది. అశ్వాపురం మండలం మొండికుంట పంచాయతీ ఆఫీసు దగ్గర వృద్ధురాలి నిరాహార దీక్ష చేస్తోంది. తన ఐదుగురు కొడుకులు తనను పట్టించుకోవడం లేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.