కబ్జా భూములను పేదలకు పంచాలి

కడప,నవంబర్‌29(జ‌నంసాక్షి): కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచిపెట్టాలని.. భూ పోరాట సాధన కమిటీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. ఒంటిమిట్ట, సిద్దవటం మండలంలోని భూ కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం వెంటనే పేదలకు, ముంపు వాసులకు, దళితులకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, భూ సాధన కమిటీ కన్వీనర్‌ బి.నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్‌, అన్వేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు పలువురు భూ నిర్వాసితులు, పేదలు, దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.