*కమ్మర్పల్లిలో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి*

కమ్మర్పల్లి27సెప్టెంబర్(జనంసాక్షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున 5 కోట్ల రూపాయలు తో సెంటర్ లైటింగ్  పనులను ప్రారంభించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్మర్పల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పేద మధ్యతరగతి వారు పెళ్లిళ్లు చేసుకోవడానికి 50 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి రాధ రాజగౌడ్, ఎంపీపీ లోలం గౌతమి సుమన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బద్దం రాజేశ్వర్, కమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ గడ్డం స్వామి, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.