కరుణానిధిని పరామర్శించనున్న కోవింద్‌

చెన్నై,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): అస్వస్థతతో స్థానిక కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన పరిస్తితి కొంచెం మెరుగవుతుందోని అన్నారు. ఇప్పటికే పలుఉవరు పరామర్శించంగా కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 5న పరామర్శించనున్నారు. రాష్ట్రపతి స్వయంగా కరుణానిధిని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుంటారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే కరుణానిధిని పరామర్శించిన వారిలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేరళ సిఎం పినరయ్‌ విజయ్‌ ఇతర రాష్ట్రాల నేతలు ఉన్నారు. బ్లడ్‌ ప్రషర్‌ ఒక్కసారిగా పడిపోవడంతో జూలై 27న కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు, ఆయనను పరామర్శించిన పలువురు నేతలు చెబుతున్నారు