కరుణించి కాపాడు కాళీమాత…

అమ్మవారి చల్లని చూపులు పట్టణ ప్రజల పై ఉండాలి.
మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్.
తాండూరు జులై24(జనంసాక్షి) పట్టణ ప్రజలను చల్లని చూపులతో దీవించాలని శ్రీ కాళికాదేవి అమ్మవారిని మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న వేడుకున్నారు.ఆదివారం తాండూరు పట్టణంలోని ఖ్యాతిగాంచిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆషాడ మాసం బోనాలు సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చైర్పర్సన్ స్వప్నను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపులు పట్టణ ప్రజల పై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మణ పురం రాము, వెంకన్న గౌడ్ , బోయ రవి రాజు, రాష్ట్ర యువత కార్యదర్శి, రఘు , బీదర్ రాజ్ శేకర్ ,బగ్వాన్, అశోక్ ముదిరాజ్ శ్రీకాంత్ రెడ్డి దత్తాత్రేయ టిఆర్ఎస్వి , నరేష్ సునీల్, అంబ్రేష్ ,బిసి మహిళ అధ్యక్షురాలు జ్యోతి, తదితరులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు