కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా..అరెస్టు!

హైదరాబాద్‌, జూలై 13 ( రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ధర్నా చేశారు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని, టీచర్ల కొరతను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోను, కళాశాలల్లోను మౌలిక వసతులు కల్పించాలని డిమాండు చేశారు. అంతేగాక కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతోను, పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను, కొందరు విద్యార్థులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీసులు శ్రమించారు.