కలెక్టరేట్ ముందు అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన
కాకినాడ,ఆగస్ట్13(జనం సాక్షి ): తూర్పుగోదావరి కలెక్టరేట్ ముందు అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. సామూహికంగా గుండు గీయించుకునే కార్యక్రమం చేశారు. అగ్రిగోల్డ్ కస్ట్మర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు సామూహిక కేశ ఖండన నిరసన చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లకు ప్రభుత్వమే బాధ్యత వహించి, చొరవ తీసుకొని తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులు కేశ ఖండన నిర్వహించి ధర్నా చేశారు.