కలెక్టర్ట్ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా
ఖమ్మం : పదోవేతన సవరణ కమిటీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఖమ్మంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్న నిర్వహించారు. హధ్యాహ్న భోజన విరామ సమయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ సహా వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరెట్ ఎదుట వైరా రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు.