కవితను కలిసిన రిటైర్డ్ ఉద్యోగులు

కవితను కలిసిన రిటైర్డ్ ఉద్యోగులు

బుధవారం ఉదయం బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.సి, టి.బి.జి.కెఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత ని ఆమె నివాసం లో కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్.సి. రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడిపెల్లి బాబు రావు, ఆళవందార్ వేణు మాధవ్ మరియు అధికారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జె.వి.దత్తాత్రేయులు తో పాటు టీబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి లు కలసి సింగరేణి రిటైర్ కార్మికుల సమస్యల పై వినతి పత్రం సమర్పించారు.1, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెరుగుదల, సంస్థ లాభాల వాటలో 10%విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాలి,ఓ.ఎన్. జి.సి అమలు పరుస్తున్న నగదు పథకం ను సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కు కూడా ప్రవేశ పెట్టాలని తెలిపారు.