కాంగ్రెస్ నిరసన ర్యాలీని జయప్రదం చేయండి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై (జనంసాక్షి):- రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లురవి సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని  బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ ఈడీ విచారణ పేరుతో పిలవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో లో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం నుండి బషీర్బాగ్ ఈ డి కార్యాలయం వరకు వేలాది మందితో నిర్వహించే చేపట్టబోయే కార్యక్రమంలో  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని మున్సిపల్ డివిజన్ నుండి అన్ని మండల కేంద్రాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జయమ్మ యూత్ కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు గుర్నాద్ రెడ్డి,కొండ్రు ప్రవీణ్, జగన్ మోహన్ రెడ్డి, గులాం అక్బర్, మాజీ ఎంపిపి లు రాచర్ల వెంకటేశ్వర్లు,జ్యోతి శ్రీనివాస్ నాయక్, వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, యాచారం మండల పార్టీ అధ్యక్షుడు మస్కు నర్సింహా,ప్రధాన కార్యదర్శి వరికుప్పల సుధాకర్, ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గౌరారం వెంకట్ రెడ్డి,జిల్లా నాయకులు ముచ్చర్ల సంపత్,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పొలమోని రామకృష్ణ యాదవ్, నాయకులు గడల మాధవి,చీరశేఖర్,నడ్డి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు