కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో జి ఎం జక్కం రమేష్ కి ఆత్మీయ వీడ్కోలు

ఆత్మీయ వీడ్కోలు
పినపాక నియోజకవర్గం ఆగుష్టు 19 (జనం సాక్షి): మణుగూరు జిఎం గా పనిచేస్తూ కొత్తగూడెం డివిజన్ కు బదిలీ అయిన జక్కం రమేష్ కి మణుగూరు ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు ,పొరుగు సేవల ఉద్యోగులు సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం జి ఎం కార్యాలయ ఆవరణలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు, కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు శాలువా పూలమాలలు పుష్పగుచ్చాలతో జి ఎం ని ఘనంగా సత్కరించారు. అనంతరం గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నా సర్ పాషా మాట్లాడుతూ ఏ అధికారి అయినా వారు పనిచేసిన కాలాన్ని వారి సీటు పక్కనే ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారన్న అంశాన్ని నల్లని బోర్డుపై తెల్లని అక్షరాలతో లిఖిస్తారని కానీ కొంతమంది అధికారులు మాత్రమే కార్మికుల హృదయపు శిలాఫలకాలపై తమ మంచితనంతో లిఖించబడతారని అలా కార్మికుల మనసు గెలిచి సమర్థవంతమైన అధికారిగా కార్మికుల్లో చెరగని ముద్ర వేసిన అధికారి జక్కం రమేష్ సేవలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలకు సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన చేసిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం సన్మాన గ్రహీత జియం జక్కం రమేష్ మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులు, కాంటాక్ట్ కార్మికులు కలిస్తేనే సింగరేణి సంస్థని కాంటాక్ట్ కార్మికుల పొరుగు సేవల ఉద్యోగుల సేవలను కూడా గుర్తించాల్సిందేనని వారి సమస్యల పరిష్కారంలో సంస్థ సానుకూలంగానే స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల చేసిన సేవలను గుర్తు చేస్తూ వారిని అభినందించారు. మణుగూరు తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తన ఆత్మీయ సత్కారానికి భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికుల తరలిరావడం పట్ల ఆయన కొంత ఆశ్చర్యాన్ని , సంతోషం వ్యక్తం చేశారు , ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఏ మంగీలాల్, సాగర్, నాగేశ్వరరావు గురుమూర్తి ,రజబ్ అలీ ,కాంతయ్య, మాలోత్ రవి, బత్తుల లక్ష్మణ్, డేగల సంపత్ కుమార్, సాంబ, సైదులు, వెంకన్న, నివాస్, శ్రావణ్ సమ్మయ్య సతీష్ ఆనంద్, శివకృష్ణ వరప్రసాద్ రవి సీత ముత్తమ్మ ఇమామ్ బి, రాజేశ్వరి, ఉపేంద్ర, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, మంగ, శైలజ తదితరులు పాల్గొన్నారు.