కాంట్రాక్ట లెక్చరర్ల జీతాలు పెంచండి

టిటిడి సభ్యుడికి వినతి పత్రం

తిరుపతి,నవంబర్‌26(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థాన విద్యా సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ లెక్చరర్లకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ మేరకు వారంతా సోమవారం టిటిడి పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఉదయం చల్లా రామచంద్రారెడ్డి స్వగృహంలో టిటిడిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లెక్చరర్లు మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుండి చాలీచాలని వేతనంతో జీవనాలు కొనసాగిస్తున్నామని ఆవేదన చెందారు. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగ భద్రత లేదన్నారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నెలసరి వేతనంతో కొన్ని ఏళ్ళ నుండి పూట గడుపుకుంటున్నామని వాపోయారు. పలుమార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఎలాంటి లాభం లేకపోయిందని తెలిపారు.