కాకతీయ అడ్మిషన్ల తేదీ పొడిగింపు

వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): కాకతీయ వర్సిటీ పిజి పరీక్షల ప్రవేశ తేదీని పొడిగించారు. ఈ మేరకు పరీక్షల విబాగం ఓ ప్రకటన విడుదల చేసింది. కేయూ 2018-19లో పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్‌-2018 గడువును ఈ నెల 10వ తేదీనుంచి 15వ తేదీ వరకు పొడిగించినట్లు కేయూ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొ. టీ మనోహర్‌ తెలిపారు.  గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని, రూ.600 అపరాధ రుసుముతో ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పరీక్షలు ఉదయం 11 నుంచి 12.30 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30వరకు జరుగుతాయని వారు తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయని సూచించారు.