కాబూల్ లో ఆత్మాహుతి దాడులు, 50 మందికి పైగా మృతి

kabul-blastకాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. దెహ్‌మజాంగ్ సర్కిల్‌లో ప్రదర్శన జరుగుతుండగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.పవర్‌ లైన్‌ రూట్ మ్యాప్‌ ను వ్యతిరేకిస్తూ హజారా మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పేలుళ్ల సమయంలో వేల మంది నిరసనకారులున్నట్లు తెలుస్తోంది.