కార్తీక పూజలు చేస్తూనే కుప్పకూలిన పూజారి

గుండెపోటుతో మృతి

ఏలూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషౄదం చోటుచేసుకుంది. ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న కోట నాగ వెంకట వరప్రసాద్‌(54) గుండెపోటుతో మృతిచెందారు. కార్తీక సోమవారం పురష్కరించుకొని భక్తులు స్వామికి పూజలు చేయడానికి భారీ సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయంలోనే పూజారి చనిపోవడంతో దర్శనాలు, పూజాకార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు.