కార్యకర్తల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై(జనంసాక్షి):-మంచాల మండలం నోముల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ పల్లాటి గోపయ్య  అనారోగ్యంతో  మరణించిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న  నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఆదివారం  గ్రామానికి విచ్చేసి పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు, కుటుంబ సభ్యుల ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, ఈ సందర్భంగా  మర్రి నిరంజన్ రెడ్డి   మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గోపయ్య గ్రామానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు, కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకునీ కోల్పోవడం చాలా బాధాకరమన్నారు, ఈ కార్యక్రమంలో నోముల ఎంపీటీసీ జయానందం, మాజీ సర్పంచ్ ముత్తమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఎమ్మెన్నార్ యువసేన అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, నాయకులు తిరుమల్ రెడ్డి ,జైపాల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Attachments area