కావూరి సాంబశివరావుకు ప్రధాని ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ ఎంపీ కావూరి సాంబశివరావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. ఎఫ్‌డీఐలపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రధాని ఆయనను కోరినట్లు సమాచారం.