కాశ్మీర్లో జెండాను అడ్డుకున్న స్థానికులు
న్యూఢిల్లీ,ఆగస్ట్14( జనం సాక్షి ): జమ్ముకశ్మీర్ లో దారుణం జరిగింది. స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్ లో ఓ వ్యక్తి మువ్వన్నెలా జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించాడు. ఐతే, స్థానికులు అతన్ని జెండా ఎగురవేయకుండా అడ్డుకున్నారు. అతనిపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. గొడవ మరింత పెద్దది కాకుండా అడ్డుకున్నాయి. లాల్ చౌక్ లో జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశాయి. శ్రీనగర్ లో భారత జెండా ఎగరేయకుండా అడ్డుకునే వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.