కాసేపట్లో రైల్వే బడ్జెట్‌

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన లోక్‌ సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ మంత్రి రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. రైలు చార్జీలు పెంచకతప్పదని అధికారపార్టీనుంచి సూచనలు వెలువడతుండగా, పెంచితే సహివంచబోమని ప్రధాన  ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతాపార్టీ ఇప్పటికే హెచ్చరించింది.