కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిపించాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం.. 6 గ్యారంటీలతో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం

భువనగిరి జనం సాక్షి;–

భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ 19వ వార్డు కౌన్సిలర్ వడిచెర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ కార్యకర్తలు గడపగడపకు తిరుగుతూ 6 గ్యారంటీల ప్రచారాన్ని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి ఇంటికి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు వస్తాయని 500 రూపాయలకే గ్యాస్ ప్రతి మహిళకు బస్సు చార్జీ ఫ్రీ తెలంగాణలో ఏ పార్టీ ఈయని విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాన్ని ప్రవేశపెట్టింది అని కాంగ్రెస్ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ డాకూరి ప్రకాష్ , జిల్లా యువర్ సెల్ అధ్యక్షుడుగుర్రం శీను, తాడూరి బాలరాజు, తాడూరు నరసింహపాల్గొన్నారు