కుటిల రాజకీయాలకు కేరాఫ్ గా బిజెపి

    – తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రావు
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
కుటిల రాజకీయాలకు కేరాఫ్ గా బిజెపి పని చేస్తుందని తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షుడు దండు ప్రవీణ్ రావు విమర్శించారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శనివారం వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోకుండా సీబీఐ అధికారులతో కవిత ఇంటిపై దాడులు చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణా సంస్కృతి,సంప్రదాయాల ఘన చరిత్రను ప్రపంచ నలుమూలల వ్యాపించేలా కృషి చేసిన కవితపై తప్పుడు ఆరోపణలు సంధించడం సరైంది కాదన్నారు. సీఎం కెసీఆర్ నేతృత్వంలో విజయ పథంలో దూసుకు పోతున్న తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిజెపి నాయకులు కుటిల రాజకీయాలకు దిగుతున్నారని వారు ఆరోపించారు.ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు ఆంక్షలను తెలంగాణా ప్రభుత్వం కొట్టి పారేయడం వల్లే మోడీ సర్కారు కుటిల ఎత్తుగడల పాచిక వేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.ప్రాంతీయ శక్తిగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందుకోవడం చేతగాకనే బిజెపి స్వార్ధ రాజకీయాలకు దిగుతోందని ఆయన పేర్కొన్నారు.నిరాధారమైన ఆరోపణలతో బిజెపి దాడులకు ఎగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో శేఖర్ రావు,సురేష్ గౌడ్,నరేష్ తదితరులు ఉన్నారు.