కుటుంబ సభ్యులతో రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్‌

4

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌తో కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ కొద్దిసేపు ముచ్చటించారు. వేములవాడ

నుంచి కేసీఆర్‌ నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.   కేసీఆర్‌ నిర్వహించిన అయుత చండీయాగంలో నిన్న రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అయితే అగ్నిప్రమాదం కారణంగా యాగంలో పాల్గొ నకుండానే వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌…రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా శీతాకాలం విడిది నిమిత్తం  రాష్ట్రపతి ప్రణబ్‌  ఈనెల 18న హైదరాబాద్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31వరకు హైదరాబాద్‌లోనే  బస చేస్తారు.