కుప్పకూలిన నాలగంతస్తుల భవనం
శిథిలాల కింద ఎనిమిది మంది
గురుగ్రామ్,జనవరి24(జనంసాక్షి): హరియాణాలోని గురుగ్రామ్ జిల్లా ఉల్లావాస్లో ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారని భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల కింద ఎనిమిది మంది చిక్కుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పొక్లెయిన్ సాయంతో భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది