కూలిన వంతెన… జర పైలం

మండల కేంద్రానుండి మర్లపల్లి వైపు మార్గంలో ఉన్న కండ్రవాగు పై ఉన్న వంతెన ఒక వైపు నుండి కూలుతోంది. ఇప్పటికే ఈ వైపు రోడ్డు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. అంతవరకు పాత వంతెన పైనే రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెన కూలిన విషయం తెలియక పాఠశాల బస్సులతో పాటు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 20 వరకు గ్రామాలతో పాటు అంతరాష్ట్ర ప్రయాణికులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాద కరంగా మారిన వంతెన పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు రాకపోకలు భద్రంగా సాగించండి.