కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోండి
– రోహిత్ హంతకులను శిక్షించాలని వీహెచ్ మౌన దీక్ష
హైదరాబాద్,జనవరి27(జనంసాక్షి): హెచ్సీయూ దళిత విద్యార్థి మృతికి కారకులైన వీసీని సస్పెండ్ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి… సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విహెచ్ అప్పారావు తీరుపై ఆయన మండిపడ్డారు. . వీహెచ్ బుధవారం ట్యాంక్బండ్ వద్ద గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్ష విరమించిన అనంతరం వీహెచ్ మాట్లాడుతూ…. రోహిత్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై మండిపడ్డారు. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఇంతగా గందరగోళం జరుగుతున్నా సిఎం కెసిఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ బడుగుల వ్యతిరేకి అని ఈ సందర్భంగా అర్థమైందని అన్నారు.రోహిత్ మరణానికి ఏబీవీపీ, బీజేపీలే కారణమని వీహెచ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జోక్యం వల్లే హెచ్సీయూ విద్యార్థులు సస్పెండ్ అయ్యారని విమర్శించారు. రోహిత్ కులంపై చర్చ అనవసరం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. విహెచ్గతంలోనే కేంద్రమంత్రికి హెచ్సియూ వ్వయహారాలపై లేఖరాశారు. అయితే తన లేఖ వల్ల ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. బీఫ్ తినడంపై రాజకీయాలు చేస్తున్నాయని ఎంఐఎం, బీజేపీలపై వీహెచ్ నిప్పులు చెరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం ఓట్ల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సాధారణమయ్యిందన్నారు.