కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో టీ, కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ, ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సురేష్‌ షెట్కర్‌ పాల్గోన్నారు. ఈ సమావేశానికి జైపాల్‌రెడ్డితో సహా ఎనిమిది మంది ఎంపీలు డుమ్మాకొట్టారు. భేటీకి గైర్హాజరైన ఎంపీలు తెలంగాణపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.