కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెదేపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయింది. నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుకోవాలని నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు హోంమంత్రికి విన్నవించారు. రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పంట నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.