కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం : సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: ఈనెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. ఈసమావేశంలో రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకుంటామని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం విధివిధానాలను ఇంకా నిర్ణయించాల్సి ఉందని పార్టీ నుంచి ఒకరా, ఇద్దరా అనేది నిర్ణయించాల్సి వుందని హోంమంత్రి తెలిపారు.