కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి -టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

 

టేకులపల్లి, జూలై 29( జనం సాక్షి ): గతంలో పనిచేసిన కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం టిస్ యు టీ ఎఫ్ టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక కేజీబీవీ పాఠశాల, కళాశాలలు గెస్ట్ ఉపాధ్యాయులు, ఆచార్లతో విద్యా బోధన గావించారు.ఈ నేపథ్యంలో గత సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 50 మంది గెస్ట్ టీచర్లుగా విధులు నిర్వహించారని ,వీరిని ఇంతవరకు తిరిగి విధుల్లో తీసుకోలేదు అన్నారు.ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి కూడా గతంలో ప్రభుత్వాని కి విన్నవించారు.వెంటనే భద్రాద్రి జిల్లా విద్యా శాఖాధికారి గతంలో పనిచేసిన గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధులు నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి , టేకుపల్లి మండల శాఖ అధ్యక్షులు బాలు, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, ఉపాధ్యక్షులు మాన్ సింగ్, ఆడిట్ కన్వీనర్ రాంజీ, కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.