కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ

కుల్కచర్ల, జులై 24 (జనం సాక్షి):
రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదినం పురస్కరించుకొని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆదేశానుసారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..తండ్రి బాటలో ప్రతిక్షణం ప్రజలకు అంకితం అని, మంత్రి కేటీఆర్ అంచనాను తెలంగాణ ప్రజల జన్మజన్మల అదృష్టమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్, ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ,టిఆర్ఎస్ పార్టీ కుల్కచర్ల, చౌడపూర్ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సుధాకర్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు కేబీ రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు యాదవ్, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, పాంబండ ఆలయ చైర్మన్ ఘనపురం రాములు, తెరాస మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య, దోమ ఎంఈఓ హరిచందర్ నాయక్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాంలాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ చంద్రరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ వై రాములు, కోఆప్షన్ మెంబర్ జుబేర్, జర్నలిస్ట్ అరవింద్ కుమార్, తెరాస నాయకులు మాలే కృష్ణయ్య గౌడ్, మఠం రాజశేఖర్, అంతారం మొగులయ్య, జోగు వెంకటయ్య గౌడ్, గుండుమల్ల నర్సింలు, చంద్రయ్య, జె వెంకటయ్య, చుక్కయ్య, కే రాములు, బాబు, వెంకట్ రాములు, వినోద్, యాదగిరి, రాములు, తదితరులు పాల్గొన్నారు.