కేటీఆర్ పర్యటనలో భాగంగా సింగరేణి టాగూర్ స్టేడియం పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా అక్టోబర్ ఒకటవ తేదీన సింగరేణి టాగూర్ స్టేడియం లో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థలాన్ని మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐఏఎస్ పరిశీలించారు. అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు అదనపు కలెక్టర్ రాహుల్, మందమర్రి ఎమ్మార్వో జి. చంద్రశేఖర్ , మున్సిపల్ కమిషనర్ జి వెంకటనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.