కేరళకు సాయంగా 25 లక్షలు ప్రకటించిన కమలహాసన్
తిరువనంతపురం,ఆగస్ట్13(జనం సాక్షి): ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్ తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. కమల్హాసన్ కేరళ సీఎం విపత్తు సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందజేశారు. తమిళ బిగ్బాస్ షో చేస్తున్న విజయ్ టీవీ యాజమాన్యం కూడా రూ.25 లక్షలు సీఎం సహాయనిధికి అందజేసింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. కేరళలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాధితుల సహాయార్థం కమల్, విజయ్ టీవీ యాజమాన్యం రూ.25 లక్షలు చొప్పున విరాళం అందించారు. తన అభిమానులు, తమిళ ప్రజలు, పార్టీ కార్యకర్తలు సీఎం సహాయనిధికి చేతనైనంత విరాళం అందించాలని కమల్హాసన్ కోరారన్నారు.