కేరళను ఆదుకోండి: ప్రధానికి రాహుల్ వినతి
న్యూఢిల్లీ,ఆగస్ట్16(జనం సాక్షి ): కేరళకు అవసరమైన సహాయమందించాలని ప్రధాని మోడీతో చర్చించానని గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. ఈ శతాబ్దపు అధ్వాన వర్షాకాలమని అన్నారు. ‘కేరళ బాధలో ఉంది. సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, నావికా దళాలను మరింత పెంచాలని మోడీని కోరాను. కేరళ చరిత్రలోనే ‘ఇంతకు ముందు చూడనటువంటి విషాదం’ నెలకొనడంతో రాష్టాన్రికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరానని’ రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.కేరళలో వరద పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్కడి ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి తోడ్పడాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన లింక్ను టాగ్ చేశారు. ఇది సహాయం చేసే సమయం అని పేర్కొన్నారు.