కేసీఆర్ కిట్తో పెరిగిన ప్రసవాలు
వరంగల్,ఆగస్ట్16(జనం సాక్షి): కెసిఆర్ కిట్ పథకంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, అవసరమైన సాంకేతిక పరికరాలు అందించి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తోందన్నారు. సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగేందుకు తల్లీబిడ్డల సంరక్షణకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం కింద జిల్లాలో ప్రసూతి పొందిన స్త్రీలకు 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుడితే 13వేలు, మగపిల్లవాడయితే రూ.12వేల అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలకు మంజూరు చేసిన పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.