కైమ్ర్‌సీన్‌ మొత్తం మార్చేశారు

` దర్యాప్తు సవాల్‌గా మారింది
` రేప్‌, మర్డర్‌ కేసును కప్పిపుచ్చే యత్నం
` సుప్రీంకు కీలక వివరాలు వెల్లడిరచిన సీబీఐ
` కోల్‌కతా హత్యాచార ఘటనపై స్టేటస్‌కో రిపోర్ట్‌
` సీజేఐ సూచనతో సమ్మె విరమించిన వైద్యులు
న్యూఢల్లీి(జనంసాక్షి):కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచార ఘటన ను సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ గురువారం కోర్టుకు స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించింది. ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తాము వెళ్లేసరికి కైమ్ర్‌ సీన్‌ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ ఆరోపించింది. ‘ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్‌గా మారింది. మేం ఐదు రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుప్రతికి వెళ్లేసరికి కైమ్ర్‌ సీన్‌ను మార్చినట్లు గుర్తించాం. ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం దిగ్భార్రతికరం. తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టారు. దీంతో అప్పుడు పోస్ట్‌మార్టంను వీడియో తీశారు‘ అని సీబీఐ కోర్టుకు వివరించింది. సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈసందర్భంగా కోల్‌కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కన్పించింది. అయినా ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదుచేయడం తీవ్ర ఆందోళనకరం. అంతేగాక.. అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే పోస్ట్‌మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉంది. శవపరీక్ష జరిగిన 18 గంటల తర్వాత కైమ్ర్‌ సీన్‌ను సీల్‌ చేశారెందుకు?‘ అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును తొలుత రికార్డుల్లో రాసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నిందితుడి వైద్య రిపోర్ట్‌ను కూడా సమర్పించాలని సీబీఐని సూచించింది. కేసు నమోదులో కోల్‌కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాదులపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సోషల్‌ విూడియా తరహా వాదనలు ఇక్కడ చేయొద్దని హెచ్చరించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్‌ లీవ్‌ కట్‌ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడిరచారు. మొదట విధులకు హాజరుకావాలని సీజేఐ సూచించారు. నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ లో రెసిడెంట్‌ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్‌ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్‌ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడిరచారు. కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను వెలువరించింది. రరేప్‌, మర్డర్‌ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడిరచింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అందించారు. సీజేఐ డివై చంద్ర చూడ్‌ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది. లోకల్‌ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సీబీఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ అందించారు. సీబీఐ అందజేసిన సీల్డ్‌ కవర్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. అప్పటికే చాలా వరకూ మార్చేశారని వెల్లడిరచారు. అయితే ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్‌ ప్రభుత్వం తరుఫున కపిల్‌ సిబల్‌ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. సీనియర్‌ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవర్‌-అప్‌ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్‌ జనరల్‌ వెల్లడిరచారు.
ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష
దిల్లీ: కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ.. ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ తీరుపై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధమున్న నలుగురు వైద్యులకు పాలీగ్రాఫ్‌ టెస్టు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది.ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచార, హత్య ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న సందీప్‌ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులను సీబీఐ విచారిస్తోంది. ఈ సమయంలో సందీప్‌ ఘోష్‌ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయనకు లై`డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే న్యాయస్థానం అనుమతి పొందిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. వీరికి లై డిటెక్టర్‌ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
సమ్మె విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు
కోల్‌కతా వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ దిల్లీ ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.11 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలు విరమిస్తున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన హావిూ, ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన పై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించిన ధర్మాసనం.. ఆందోళనల కారణంగా పేదలు నష్టపోకూడదని వ్యాఖ్యానించింది. వెంటనే విధుల్లో చేరాలని.. ఆందోళనలు చేపట్టిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని హావిూ ఇచ్చింది. ఈ క్రమంలోనే దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఆందోళనలు విరమించారు.