కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. టవాంగ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని విరిగిపడిన కొండచరియలను తొలగించే పని చేపడుతున్నాయి.