కొండ మురళి అనర్హత పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: కొండ మురళిపై దాఖలైన అనర్హతా పిటిషన్‌పై మండలి చైర్మన్‌ చక్రపాణి త్వరలోనే నిర్లయం ప్రకటిస్తారని మండలి విప్‌ శివరామి రెడ్డి తెలిపారు. మురళి అనర్హత పిటిషన్‌పై ఇవాల్టితో వాదనలు పూర్తి పూర్తయ్యాయి ఇవాళ కూడా మురళి చైర్మెన్‌ముందు హజరు కాలేదు. అయన తరుపు న్యాయవాది మాత్రమే వాదనలు వినిపించారు. అటు తాము మాత్రం సాక్ష్యాలతో సహ మురళి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు చైర్మెన్‌ ముందు వాదించామని శివరామి రెడ్డి తెలిపారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మవతి క్షమాపణ చెప్పి తిరిగి కాంగ్రేస్‌లో కొనసాగుతానని చెప్పారని, అందుకే తాము అనర్హత వేటు వేయడం లేదని అయన చేప్పారు.