కోహ్లీ సేనకు బిసిసిఐ బంపర్ ఆఫర్: ఇక జీతాలు డబుల్

టెస్టు మ్యాచ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొత్త తరాల్లో, భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. శుక్రవారం ముంబైలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఠాకూర్ ప్రకటించారు. కాగా, బిసిసిఐ తన ఆధ్వర్యంలోని ఇతర సంఘాలకు వార్షికంగా ఇచ్చే సబ్సిడీని 60 లక్షల నుంచి రూ. 70లక్షలకు పెంచడం జరిగింది.