క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి ఎంపీడీవో సురేందర్ నాయక్

కొడకండ్ల,నవంబర్18 (జనంసాక్షి )కొడకండ్ల మండలంలోని పెద్దబాయ్ తండ, లక్ష్మక్క పెళ్లి, రామేశ్వరం క్రీడా ప్రాంగణాలను, నర్సరీ ప్రోగ్రెస్ విజిట్ చేసిన ఎం పి డి వో సురేందర్ నాయక్.అనంతరం మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణాలు వారంలో పూర్తి చేయాలని సర్పంచ్, కార్యదర్శులకు తెలపడం జరిగింది. కొడకండ్ల మండలం నర్సరీలకు సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించి టార్గెట్ 4 లక్షల 50 వేలు, చిన్న మొక్కలు పెద్ద బ్యాగులో కన్వెన్షన్ చేయుటకు 25400, కవర్లు గట్టిగా ఉన్న బ్యాగులు కంటిన్యూ వచ్చేసి 25250, ఇచ్చిన టార్గెట్ గ్రామం వారి వారం రోజులలో బ్యాంగు ఫిల్లింగ్ మట్టితోలించాలి ప్రతి నర్సరీకి ప్రైమరీ బెడ్ 5 ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్ల సర్వే పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయాలని అధికారులకు సూచించారు. సిబ్బంది అందరూ సకాలంలో సమయపాలన పాటించి విధులకు హాజరు కావాలని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ పి వో యన్ కుమారస్వామి గౌడ్,ఈ సి మోహన్,టి ఏ భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్ చందర్ మేట్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.