గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం – డోర్నకల్ సీఐ బంధం ఉపేందర్ రావు

– భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో గణపతి నిమజ్జనం నిర్వహించుకోవాలి

డోర్నకల్, సెప్టెంబర్-26, జనం సాక్షి న్యూస్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి నిమజ్జనంకు వెళుతున్న క్రమంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని డోర్నకల్ సీఐ బంధం ఉపేందర్ రావ్ తెలిపారు.

గణపతి నిమజ్జనం సమయంలో పాటించవలసిన నియమాలు

1) డీజే సౌండ్ సిస్టం వినియోగించినటువంటి వారిపై కేసు నమోదు చేసి డీజే సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరుగుతుంది.
2) ఎవరైనా నిమర్జనం ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొన్నా, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
3)నిమజ్జన సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోగలరు.
4)మీ యొక్క విగ్రహాలను వీలైనంత తొందరగా నిమజ్జనం కొరకు చెరువు వద్దకు తీసుకొని వెళ్ళగలరు.
5)నిమర్జనం ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ఫోన్ నెంబర్స్ :డైల్ -100, లేదా 8712656940, 8712656942 సమాచారం అందజేయగలరు అని సిఐ ఉపేందర్ రావ్ తెలిపారు. కావున ప్రజలందరూ గణపతి నిమర్జన ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంతంమైన వాతావరణంలో పై నిబంధనలు పాటించి నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.