గణేశుని అనుగ్రహం పై ఉండాలి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్

బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని కొర్వీ చేడ్ ఘనిలో ఏకదంతా వినాయకుని విగ్రహం పెట్టి నిత్యం పూజలు చేసి 11వ రోజున గంగమ్మ ఒడికి గణపయ్య చేరునున్న సందర్భంగా బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మన్ రావు పాల్గొని గణేష్ మహరాజ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంలో మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్ మాట్లాడుతూ పదకొండు రోజులపాటు నిత్యం పూజలు, భజనలు అందుకున్న ఈ ఏకదంతా వినాయకుని ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలని రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందాలని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలికేడ్ వెంకటేష్ మహారాజ్, మహారాష్ట్ర అంబన్న,సూర్య నాయక్, హీర్య నాయక్,సేవ్యా నాయక్,అశోక్, అంబు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.