గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

2
హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి చర్చించారు. స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఆనంద్‌ నగర్‌ ప్రాంతానికి గవర్నర్‌ ఇంచార్జ్‌ గా వ్యవహారించారు. స్వచ్చ హైదరాబాద్‌లో గవర్నర్‌ పాల్గొన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.