గవర్నర్‌తో సీఎం భేటీ

1
ఎంట్రీ ట్యాక్స్‌ పలు అంశాలపై స్పష్టత

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ తో రాజ్‌ భవన్‌ లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లగొండ జిల్లాలో కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై తీసుకోనున్న చర్యలను గురించి గవర్నర్‌ తో చర్చించారు. అదేవిధంగా నరసింహన్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా జరిగిన చర్చల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రదాని ఇచ్చిన విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ గౌర్హాజరైనందున గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయి ఆ వివరాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.