*గాంధీ కలలు కన్నా స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం

 *వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2)* మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజాన్ రెడ్డి అన్నారు. అలంపూర్ మున్సిపాల్టీ నందు  ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీజీ  జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగీరెడ్డీ నిరంజన్ రెడ్డితో కలిసి, స్థానిక అలంపూర్ శాసనసభ్యులు.వి.యం.అబ్రహం,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరితలు పూలమాల వేసినివాళి అర్పించారు.ఈసందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం శాంతి కి మార్గదర్శిగాంధీ అన్నారు.గాంధీ దేశానికి చేసినసేవలనుకొనియాడారు. దేశం అంతటిని ఒకే తాటిపైకితెచ్చి,స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి, తనచివరి శ్వాసవరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారున్నారు. బడుగు,బలహీన అభ్యున్నతి  కృషిచేసిన వ్యక్తి ,అహింస మార్గంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని,గడగడలాడించింది గాంధీజీఅని తెలిపారు.ఈకార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మనోరమ, వైస్ చైర్మన్ వెంకటేశ్వరెడ్డి,జడ్పిటిసి రాజు, వార్డ్ కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Attachments area