గారకుంట తండాలో డొంక రోడ్డు చదును చేయించిన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్

గరిడేపల్లి మండల పరిధిలోని గారకుంట తండా గ్రామంలో రైతుల సౌకర్యార్థం పొలాలకు వెళ్లే డొంక రోడ్డును స్థానిక గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం జెసిబి తో చదును చేయించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ పొలాలకు వెళ్లేందుకు రోడ్డుపై గుంతలు చెట్లు అడ్డుగా ఉన్నాయని విన్నవించడంతో ఆయన సొంత ఖర్చులతో డొంకను బాగు చేయించినట్లు తెలిపారు. దీంతో రైతులు ఎంపీపీ పని తీరుపై  హర్షం వ్యక్తం చేస్తున్నారు