గుంటూరులో నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

కేక్‌ కట్‌ చేసిన టిడిపి నేతలు

అభినందించిన నటి దివ్యవాణి

గుంటూరు,జనవరి23(జ‌నంసాక్షి): మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నేత, ఎల్వీఆర్‌ క్లబ్‌ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర(నానీ) ఆధ్వర్యంలో లోకేష్‌ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుంటూరు పట్టణంలోని నిర్మల హృదయ్‌లో మానసిక వికలాంగుల సమక్షంలో నానీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం దివ్యాంగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నానీ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పుట్టినరోజున కూడా దావోస్‌లో మంత్రి లోకేష్‌ పర్యటిస్తుండడం పనిపై ఆయన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో తండ్రికి తగ్గ తనయుడికి లోకేష్‌ వ్యవహరిస్తున్నారని నానీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వరరావు, టీడీపీ నేతలు కసుమర్తి, ముత్తినేని, ముక్కపాటి అనిల్‌, రుస్తుంబాబు పాల్గొన్నారు. మరోవైపు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పుట్టిన రోజున నారా లోకేష్‌ పుట్టడం సంతోషమని సినీనటి దివ్యవాణి అన్నారు. పుట్టినరోజున కూడా రాష్ట్రం కోసం దావోస్‌లో పని చేస్తుండడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పొందిన స్ఫూర్తికి నిదర్శనమన్నారు.చిన్న వయస్సులో నిత్యం కష్టపడుతున్న లోకేష్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని దివ్యవాణిచెప్పారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అభినందనీయమని, అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, చంద్రబాబు లాంటి నేత మనకు దొరకడం అదృష్టమని దివ్యవాణి తెలిపారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.