గుంటూరు జిల్లా ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో పలు ప్రజా సంఘాల దళిత నాయకులు నివాళులు అర్పించారు
రఘునాథ పాలెం.జనం సాక్షి
గుంటూరు జిల్లా చుండూరు లో 1991 ఆగస్టు 6 న మాలలపై రెడ్డి కులస్తులు చేసిన ధమనకాండ నరమేదానికి బలైన మాల అమరవీరులకు ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో పలు ప్రజా సంఘాల దళిత నాయకులు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు గుంతేటి వీరభద్రం బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ మరియు దళిత ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ చుండూరులో మాలల విద్యా ఆత్మగౌరవ చైతన్యాన్ని ఓర్వలేని చుండూరు రెడ్డి కులస్తులు ఒక తప్పుడు సంఘటన ఆధారంగా కుల అహంకార ఆధిపత్యంతో చుట్టుపక్కల గ్రామాల రెడ్లను సమీకరించుకొని దొంగ చాటున చుండూరు గ్రామ మాలపల్లి పై గోడ్డ ల్లు రాడ్లు కొడవళ్ళు దొడ్డు కొర్రలతో దాడి చేసి నర మేధాన్ని సృష్టించి పదిమంది మాలలను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపి వేశారని అనేకమంది తమ అవయవాలను కోల్పోయారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు చుండూరు లో మాలలపై కారం చేడులో మాదిగలపై అగ్రవర్ణాలు దాడి చేస్తే మాల మాదిగలు ఐక్యమై బాధిత దళితుల పక్షాన న్యాయం కోసం పెద్ద ఎత్తున దళిత ఉద్యమాలు నిర్వహించారని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యక వాదులు మేధావులు దళితులు పక్షాన నాడు నిలబడ్డారని గుర్తు చేశారు చుండూరులో జరిగిన దమనకాండ దేశవ్యాప్తంగా అగ్రకుల ఆధిపత్యాన్ని ఎండగట్టాయని నాయకులు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన మానవ హక్కులు అంబేద్కర్ స్ఫూర్తితో జరిగిన ఉద్యమాలు కోర్టు తీర్పులతో నాడు దాడిలో పాల్గొన్న అగ్రకులాల నరహంతకులు సమాజంలో దోషులుగా నిలబడ్డారని నాయకులు పేర్కొన్నారు నాటి ఉద్యమ స్ఫూర్తితో నేడు దళిత గిరిజనులపై దాడులు జరిగితే దళితులంతో ఐక్యమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నందిగామ రాజ్ కుమార్ లంబాడా రాష్ట్ర నాయకులు బానోతు బద్రు నాయక్ నకరికంటి సంజీవరావు కామా అశోక్ కాలంగి దేవదానం దామల సత్యనారాయణ ఎర్ర గంగాధర్ ముడుసు జాకబ్ గొట్టముక్కల శ్రీనివాస్ పేతురు పేరయ్య దాసరి శ్రీనివాస్ గాదరి బాబు పద్మ అరికట్ల పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు